హాలీడే కాదు.. ఓటింగ్ డే.. ఎమ్మెల్సీ కవిత

యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు నియోగించుకోవాలని తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.  

ఈ రోజు సెలవు కాదనీ,  ఓటింగ్ డే అనీ అన్నారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే అందరూ ఓటేయాలని కవిత పేర్కొన్నారు. ఈ ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు.

2018లో బీఆర్ఎస్ కు మద్దతిచ్చినట్లే ఈసారీ జనం తమనే గెలిపిస్తారన్న విశ్వాసాన్ని కవిత వ్యక్తం చేశారు.  ప్రజల ప్రేమాభిమానాలు కేసీఆర్ వైపే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu