నిరుద్యోగుల కోసం మూడు పథకాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెడుతూ నిరుద్యోగుల కోసం మూడు పథకాలను ప్రకటించారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు వుంటాయని ఆమె తెలిపారు. ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా ఈ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. సంఘటిత రంగంలో ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల జీతం మూడు వాయిదాలలో అదనంగా చెల్లిస్తామని చెప్పారు. నెలకు లక్ష లోపు జీతం వున్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులని, వారికి గరిష్టంగా 15 వేల వరకు చెల్లిస్తామని వెల్లడించారు. ఈ పథకాల వల్ల 210 లక్షల మంది యువతకు మేలు చేకూరుతుందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu