యన్టీఆర్, చిరంజీవి మేటి నటులు: యన్డీ.టీ.వీ.

 

ఈ నెల 21న భారతీయ సినీపరిశ్రమ 100సం.లు పూర్తిచేసుకొన్నశుభసందర్భంగా చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆసక్తికరమయిన విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిష్టాత్మకమయిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రముఖ బాలివుడ్ నటుడు ప్రాణ్ అందుకొనగా, సినీ పరిశ్రమలో 20మంది మేటి నటుల పేర్లను ప్రముఖ హిందీ చానల్ యన్డీ.టీ.వీ.ప్రకటించింది. వారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 6వ స్థానం పొందగా, మెగా స్టార్ చిరంజీవి 15వ స్థానంలో నిలిచారు. కానీ, ఈ చానల్ యాజమాన్యం ఉత్తరాదికి చెందినది కావడంతో దక్షిణాది సినీ రంగంలో స్వర్గీయ యస్వీ రంగారావు, జగ్గయ్య, అంజలీ దేవి, జమున, సావిత్రి, అక్కినేని నాగేశ్వర రావు, సత్యనారాయణ, గుమ్మడి వంటి అనేక మంది గొప్పనటులను విస్మరించింది. అదేవిధంగా దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్ర పరిశ్రమలకు సేవలందించిన మేటి నటీనటులను కూడా విస్మరించి, బాలివుడ్ కే ప్రాముఖ్యత ఇచ్చింది. ఆ చానల్ ఎంపిక చేసిన 20 మందిమేటి నటులలో ఒక్క మహిళానటి కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తుంది. యన్డీ.టీ.వీ.ప్రకటించిన ఆ 20మంది మేటి నటులు వీరే: బాలివుడ్ నటులు 1.దిలీప్ కుమార్; 2.రాజేష్ ఖన్నా; 3.అమితాబ్ బచ్చన్; 4.రజినీకాంత్(తమిళ్) ; 5.ప్రాణ్ శిఖండ్(హిందీ); 6.స్వర్గీయ యన్టీ.రామారావు(తెలుగు); 7.ఉత్తమ కుమార్, 8.స్వర్గీయ యమ్జీ. రామచంద్రన్(తమిళ్); 9.మోహన్ లాల్(మలయాళం); 10.నసీరుదీన్ షా(హిందీ); 11.స్వర్గీయ రాజ్ కపూర్( హిందీ); 12.కమల్ హాస్సన్( తమిళ్); 13.బలరాజ్ సహాని; 14.స్వర్గీయ ఉత్పల్ దత్(హిందీ); 15.చిరంజీవి( తెలుగు); 16.స్వర్గీయ రాజ్ కుమార్ (కన్నడ); 17.స్వర్గీయ శివాజీ గనేషన్ (తమిళ్); 18.మమ్మూట్టి (మలయాళం);19. షారుక్ ఖాన్ (హిందీ); 20.అమీర్ ఖాన్ (హిందీ).