నేడు కోర్టుకు సోనియా, రాహుల్..!

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ..ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో పటియాలా కోర్టు దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కోర్టు ఆవణలో సుమారు 16కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులను కూడా పోలీసులు మూయించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా తమ ఎంపీలను ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించిందట. మరోవైపు ఇక్కడ తెలంగాణలో సోనియా, రాహుల్ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ సోనియా, రాహుల్ ను అరెస్ట్ చేస్తే జైలుభరో నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారంట. ఇదిలా ఉండగా ఈ విషయంపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ హయాంలోదే అని.. దీనివల్ల పార్లమెంట్ సమావేశాలకు అడ్డుపడటం సమంజసం కాదని.. పార్లమెంట్ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu