జగన్‌‌కు నమ్మకం లేకే ప్రశాంత్ కిశోర్‌ను తెచ్చుకున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్. జగన్‌కు తన మీద తనకు నమ్మకం లేదని అందుకే ప్రశాంత్ కిశోర్‌ను తెచ్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ అండ్ టీమ్ అసూయ పడుతున్నారని..అందుకే చంద్రబాబు మీదా..ప్రభుత్వం మీదా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబుపై ఎంతో మంది ఎన్నో ఆరోపణలు చేశారని అయినా ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయారని అన్నారు. చంద్రబాబును తిట్టడం కోసమే గుంటూరులో ప్లీనరీని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu