ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ నిందితులు అరెస్ట్...

 

ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నగర శివారు రామచంద్రాపురంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడి చేసిన నిందితులు ముంబయి పారిపోతుండగా మహారాష్ట్రలోని లాతూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వాడిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఇప్పటికే కర్ణాటకలో పట్టుకున్నారు. కాగా గతవారం రామచంద్రాపురం ముత్తూట్‌ ఫైనాన్స్‌లోకి చొరబడిన ఐదుగురు నిందితులు రూ.12కోట్ల విలువైన 45కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu