శివసేన తాజా వాగుడు

 

అతిగా వాగే వాళ్ళలో శివసేన నాయకులు మొదటి వరసలో వుంటారు. నిన్నగాక మొన్నే ఒక శివసేన నాయకుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకే ఓటుహక్కు ఇవ్వాలని వంకరగా మాట్లాడాడు. ఇప్పుడు శివసేన భారత ప్రభుత్వానికి మరో కుళ్ళు ప్రతిపాదన చేసింది. ముస్లింలు, క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకుంటేనే ఓటుహక్కు కల్పించాలని చెప్పింది. జనాభాను పెంచుకుంటే సరిపోదని, కుటుంబానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం గురించి ఆలోచించాలని పేర్కొంది. కుటుంబం ఆరోగ్యంగా వుండేలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం వరకు బాగానే వుందిగానీ, ముస్లింలు, క్రైస్తవులను టార్గెట్ చేయడం మాత్రం బాగాలేదని పరిశీలకులు అంటున్నారు.