కోతి రైళ్లను ఆపేసింది

 

ఒక కోతి వల్ల రైళ్లు ఆగిపోయాయి. ఈ విచిత్రమైన ఘటన ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా.. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు స్టేషన్లో ఓ గూడ్స్ రైలును క్రాసింగ్ కోసం ఆపారు. అయితే ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఒక కోతి ఆగి వున్న గూడ్స్ వ్యాగన్ మీదకు ఎక్కింది. అక్కడితో ఆగకుండా అక్కడి నుండి ఎగురుతూ విద్యుత్ కాంటాక్ట్ వైరును పట్టుకుంది. దీంతో ఒక్కసారిగా హైవోల్టేజ్ విద్యుత్ ప్రసారం జరిగి మంటలు చెలరేగి, విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి. ఈ ఘటనతో రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు రైళ్లన్నీ ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇంత జరిగినా కూడా కోతికి మాత్రం ఏం జరగలేదు. విద్యుత్ తీగ తెగినవెంటనే దానిని వదిలి చక్కగా పారిపోయింది.