ముద్రగడ పాదయాత్ర.. గేటు దగ్గరే అడ్డుకున్న పోలీసులు...

 

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో కిర్లంపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ 30, 144 సెక్షన్లు అమలు చేశారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక ఈ రోజు పాదయాత్రను చేయడానికి గాను ముద్రగడ ఇంటి నుండి బయటకు రావడంతో, గేటు కూడా దాటకముందే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తనను పాదయాత్రకు వెళ్లనివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. పోలీసులు మాత్రం, ర్యాలీకి, పాదయాత్రలకు ఈ ప్రాంతంలో అనుమతులు లేనందున, బయటకు అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేశారు.