దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి 

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే సూచనతో ట్రాక్టర్ డ్రైవర్ పిల్లలను ఎక్కించుకొని అటు, ఇటు తిప్పారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ అదుపు తప్పి చేపల చెరువులోకి వెళ్ళడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడగా వారిని స్థానికులు ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా.. అందులో కొంతమంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు అబ్బయ్య చౌదరినే కారణమని…ఆయన ప్రచార ఆర్భాటమే పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.