కేసీఆర్ యాగానికి నిధులు అక్కడివే.. మధుయాష్కీ
posted on Dec 22, 2015 9:22AM

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగం పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి నిధులు ఎక్కడినుండి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు కేసీఆర్ ను ప్రశ్నించిన ఆయన దానికి సమాధానం కూడా ఆయనే చెప్పేశారు. కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి నిధులు నారాయణ.. చైతన్య కాలేజీల నుంచి వచ్చిన ముడుపులే అని.. అలా కాకుంటే తాను చేసినవి అసత్య ఆరోపణలు అయితే నిధులకు సంబంధించిన వివరాలు ప్రజలకు అందించాలని అన్నారు. మరోవైపు కేసీఆర్ ఈ చండీయాగం తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నానని చెబుతున్నారు. మరి మధుయాష్కీ చేసిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.