మరోసారి హెచ్చరిక.. ఉగ్రవాదుల చొరబాటు..

 

నిఘా వర్గాలు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోకి లష్కరే తోయిబాకు చెందిన 20 నుంచి 25 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దు పట్టణాలు లేదా దేశంలోని ఏదైనా మెట్రో నగరంలో వీరు భయంకర దాడికి దిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, టూరిస్టు ప్రాంతాలు, మాల్స్, హోటళ్లను వీరు టార్గెట్ గా చేసుకోవచ్చని భావిస్తున్నామని నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేయడంతో... ప్రధాన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతను మరింగా పెంచారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu