సచివాలయానికి బాంబు బెదిరింపు..

ఈ మధ్య ఎక్కడ చూసినా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సచివాలయానికి బాంబు బెదిరింపు ఫొన్‌కాల్‌ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సచివాలయంలో బాంబు పెట్టామని ఫోన్ చేసి బెదిరించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించాయి. కానీ అది ఫేక్ కాలని.. ఎలాంటి బాంబు లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆ సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదే భవనంలోని 15వ అంతస్థులో ఉన్నట్లు తెలుస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu