కోదండరామ్ ను ఏమనొద్దు.. కేసీఆర్ ఆదేశం

 

కేసీఆర్ పాలనను విమర్శించినందుకు గాను కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పలువురు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కోదండరాంపై దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో కోదండరామ్ పై సానుభూతి తెలిపిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన కేసీఆర్ పార్టీ నేతలకు కొన్ని ఆదేశాలు జారీ చేశారంట. కోదండరామ్ పై విమర్శలకు దిగితే దానిని విపక్షాలు అనుకూలంగా తీసుకుంటాయని అందుకే కోదండరామ్ ను, జేఏసీ నేతలను విమర్శించవద్దని సూచించారంట. జేఏసీలో మిగిలిన నేతలంతా కోదండరామ్ వెనకే నడుస్తామని చెప్పడం, ఆయన్ను విమర్శిస్తే, ప్రభుత్వం పట్ల ప్రజల్లో అపనమ్మకం రావచ్చన్న అంచనాలు కూడా ఆయన తాజా ఆదేశాలకు కారణమని తెలుస్తోంది. మరి కేసీఆర్ మాటపై టీఆర్ఎస్ నేతలు ఎంత వరకూ నిలుస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu