కడప కోసం సచివాలయం మూత

తిరుపతి: కడప ఉప ఎన్నికల కోసం ప్రజాసమస్యలను సైతం పక్కనపెట్టి రాష్ట్ర సచివాలయాన్ని మూత వేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం కిరణ్ కుర్చీకి, కడప ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం ముడిపెట్టిందన్నారు. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. అందరికీ కడప ఎన్నికల ఓటమి భయం పట్టుకుని అక్కడే చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీలు ఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారా లేదా అన్నది ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని చెప్పారు. కడప ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఎవరికి మద్దతునిచ్చేది త్వరలో ప్రకటిస్తామన్నారు. కడప జిల్లా కమిటీతో చర్చించి వారి అభిప్రాయాలకనుగుణంగా సీపీఎం ఉప ఎన్నికల విధానం ప్రకటిస్తామని తెలిపా రు. పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యం విషయంలో ట్రస్టు సభ్యులు అసత్యాలు చెబుతున్నారని రాఘవులు విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu