కేసీఆర్ కు ఏం జ్వరం వచ్చిందో.. జూపుడి

టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కావాలనే జ్వరం అని చెప్పి కేసీఆర్ రాష్ట్రపతితో సమావేశాన్ని తిరస్కరించారని.. ఇద్దరు సీఎంలతో రాష్ట్రపతి సమావేశమైతే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావించామని.. కానీ తెలంగాణ ప్రభుత్వం దానికి సహకరించలేదని ఎద్దేవ చేశారు. కేసీఆర్‌కు ఏ జ్వరం రాలేదని విమర్శించారు. చంద్రబాబు కేసీఆర్ లా కాదని.. చంద్రబాబుకు దూర దృష్టి ఎక్కువని చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని చెప్పారని జూపుడి అన్నారు. కానీ తెలంగాణ వైఖరి చూస్తే రెడ్డగొట్టే విధానాలే కనిపిస్తున్నాయని అన్నారు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నామని, సీఎం కేసీఆర్‌ తన భాషను మార్చుకోవాలని జూపూడి కోరారు.