జెఎన్ యూ.. మరో వివాదాస్పద పోస్టర్..


జెఎన్ యూ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయపడుతోంది. ఇప్పటికే ఈ విషయంపై రాజ్యసభలో దుమారం రేగుతోంది. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఇప్పటికే జెఎన్ యూకి సంబంధించి తన ప్రసంగంలో చెప్పిన విషయాలు విన్నవారు ఆశ్ఛర్యపోతున్నారు. దుర్గాదేవి మీద విద్యార్దులు చేసిన వ్యాఖ్యలు.. దుర్గాదేవిని ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారన్న విషయాన్ని ఆమె చెప్పారు. దీంతో విన్న సగటు భారతీయుల గుండె మండిపోయింది. దీనికి తోడు మరో విషయం బయటపడింది. దుర్గాదేవి మీద వేసిన పోస్టర్ తరహాలోనే.. మరో బరితెగింపు పోస్టర్ ను జేఎన్ యూ విద్యార్థులు వేశారు. ‘‘ఇండియా ఓ జైలు’’ అంటూ మరో బరితెగింపు పోస్టర్ ను వేశారు. దీంతో పోలీసులు.. పోస్టర్ వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయం మీద దృష్టి సారించారు. ఈ పోస్టర్ ను ప్రింట్ తీసిన జిరాక్స్ షాపు యజమానిని విచారిస్తున్నారు. ఈ షాపు కూడా వర్సిటీ బయటే ఉండటం గమనార్హం.