మరోసారి జమ్ముకాశ్మీర్లో చెలరేగిన అల్లర్లు....

 

చాలా రోజుల నుండి ప్రశాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని గలందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీనిలో భాగంగానే భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. జతీయరహదారిపై కొంతసేపు వాహన రాకపోకలను నిలిపివేశారు. ఈ సమయంలో, భద్రతాదళాలపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేయడానికి సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించి... గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.