జగన్ కోసం జనం రాలేదు..!

 

ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్తా ఓడిపోవడంతో పులివెందులలో సీన్ రివర్స్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా పులివెందులకు జగన్ వస్తున్నాడని పార్టీ కార్యాలయానికి సమాచారం వచ్చింది. అయినా జనం అక్కడకు ఎవరూ రాలేదు. జగన్ అనుచరులు ఓ పది మంది తప్పితే కార్యాలయం పూర్తిగా బోసిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలో పడ్డారు. పరిస్థితిలో ఇంత మార్పు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు. జగన్ ఛరీష్మా తగ్గిపోయిందా ? అని గుసగుసలు పోతుండడం గమనార్హం. అధికారం లేకున్నా గత నాలుగేళ్లుగా జగన్ కు జనం భారీగానే వచ్చే వారు. అది దక్కుతుంది అనుకుంటే జనం హ్యాండివ్వడంతో పరిస్థితిలో మార్పులు అప్పుడే కనిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu