భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలి: సుజనాచౌదరి
posted on Aug 8, 2014 4:45PM

తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాల నిలిపివేతపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగింది. సుజనా చౌదరి మాట్లాడుతూ ఆర్టిక్ 19(1) ప్రకారం భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరముందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చేలా ప్రసారాలు చేశారని కొన్ని చానెళ్లపై కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఆ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభ, మండలిలో తీర్మానం చేశారని, రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయించిందన్నారు. జూన్ 16 నుంచి దాదాపు వంద రోజులుగా తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు నిలిచిపోయాయన్నారు. సొంత ఎజెండాతో పాలించే అధికారం ఎవరికైనా ఉందా అని సభలో ప్రశ్నించారు. తెలంగాణలో మీడియాపై ఆంక్షలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.