ఆంధ్ర ప్రభుత్వం జెండా పండుగ ఎక్కడ నిర్వహిస్తుంది?
posted on Aug 8, 2014 12:30PM
.jpg)
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవాన్ని గోల్కొండ కోటలో జరుపుకోవాలని నిశ్చయించుకొని అందుకు తగిన సన్నాహాలు కూడా మొదలుపెట్టేసారు. అయితే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ జరుపుకోవాలో ఇంకా నిశ్చయించుకోక పోవడంతో, ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది. నిన్న విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కొత్త రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండటమే సబబు అని చెప్పారు. అంటే కొత్త రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యనే నిర్మించేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర రాజధానిలో నిర్వహించే ఆనవాయితీని పాటిస్తూ విజయవాడలోనే ఈ కార్యక్రమం నిర్వహించవచ్చును. ఒకవేళ ప్రభుత్వం ఆ ఆనవాయితీని పాటించదలచకపోయినట్లయితే, ఈ వేడుకలను విశాఖ, తిరుపతి, కర్నూలు లేదా రాష్ట్రంలో మరే ప్రాంతంలోనయినా నిర్వహించవచ్చును. కానీ హైదరాబాదులో మాత్రం నిర్వహించకపోవచ్చును.