ఇండియా- శ్రీలంక మ్యాచ్ ప్రారంభం..


ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017లో భాగంగా ఇండియా- శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. లండన్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మరో కొత్త విషయం కూడా ఉంది. ఈరెండింటి మధ్య ఇప్పుడు జరుగుతున్నది 150వ వన్డే. ఇప్ప‌టివ‌ర‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ రెండు దేశాలు 150 వన్డేల్లో ఆడ‌లేదు. టీమిండియా, శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్లు తొలిసారి 150 వన్డేల్లో ఆడిన జ‌ట్లుగా నిలిచాయి.  కాగా ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో టీమిండియానే పైచేయిగా నిలిచింది.  83 మ్యాచుల్లో భార‌త్‌  గెలవగా, శ్రీ‌లంక 54 మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌ టై.. ఫలితం తేలని మ్యాచ్‌లు 11 ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu