రెండు వికెట్లు కోల్పోయిన భారత్..


ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా భారత్ బ్యాటింగ్ చేస్తుంది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కేవలం 137 పరుగులు మాత్రమే చేసి చాలా తక్కువ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఇక నిన్న బ్యాటింగ్ కు దిగిన ఇండియా 6 ఓవర్లకు 19 పరుగులు చేసింది. ఇక ఈరోజు బ్యాటింగ్ కు దిగిన భారత్ ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి.. 19 ఓవర్లకి 84 పరుగులు చేసింది.