దొరికితే దొంగ దొరకకపోతే దొర ...సెలబ్రిటీల తీరు ఇదే

తెలంగాణలో బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో ఆరోపణలు  ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో విచారణకు హాజరు కావడం లేదని సెలబ్రిటీలు చెబుతున్నారు. నేరం చేయనప్పుడు అరెస్ట్ చేసే అవకాశమే లేదు . అయినా సెలబ్రిటిలు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించడమే. బెట్టింగ్ యాప్ ప్రోత్సహించడం హీనియస్ క్రైం. బెట్టింగ్ యాప్ ల వల్ల ఆత్మహత్యలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కూడా.   ఈ విషయం తెలుసుకాబట్టే సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ లకు రావడానికి భయపడుతున్నారు. అలా భయపడుతున్న వారిలో యూట్యూబర్ హర్షసాయి చేరాడు. ఆయనపై పంజాగుట్ట, మియాపూర్  పోలీస్ స్టేషన్లలో వేర్వురు కేసులు నమోదయ్యాయి. విచారణకు రావాలని పోలీసులు పిలిచినప్పటికీ హర్షసాయి ముఖం చాటేశాడు. నేరుగా  గురువారం ( ఏప్రిల్ 3) హైకోర్టును ఆశ్రయించాడు. తనపై మియాపూర్ , పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదయ్యాయంటూ న్యాయస్థానం ఆశ్రయించాడు. తనపై కక్ష్య కట్టిన కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. వాస్తవానికి సామాజిక కార్యకర్త ఒకరు  ఆధారాలతో బయట పెట్టడం వల్లే 15 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు విచారణ జరుపుతుంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తాము నిర్దోషులమని ప్రూవ్ చేసుకోవల్సి ఉంటుంది. అవేవి లేకుండానే సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టు నాశ్రయిస్తున్నారు. తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోర్టును అభ్యర్థిస్తున్నారు. కేవలం కేసు నమోదైతేనే కోర్టు నాశ్రయించడం అంటే తాము చేసిన నేరాన్ని పరోక్షంగా ఒప్పుకోవడమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. హైకోర్టునాశ్రయించిన సెలబ్రిటీలలో మొదటి స్థానంలో నిలిచిన వారిలో వైకాపా అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. కాసులకు కక్కుర్తి పడ్డ శ్యామల ఒక్కో బెట్టింగ్ యాప్ నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆమె హైకోర్టు నాశ్రయించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. యాంకర్ విష్ణు ప్రియ కూడా తెలంగాణ హైకోర్టు నాశ్రయించి భంగపడింది. తాజాగా యూట్యూబర్ హర్షసాయి హైకోర్టు నాశ్రయించినప్పటికీ ఫలితం శూన్యమని న్యాయనిపుణులు చెబుతున్నారు. క్వాష్ కొట్టివేస్తే అవమానమైనప్పటికీ హర్షసాయి హైకోర్టునాశ్రయించడం గమనార్హం. హర్షసాయిపై  ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్  అత్యాచార ఆరోపణలు  చేశారు. ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైనప్పటికీ పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్షసాయి మోసం చేసినట్టు ముంబైకు చెందిన యువతి కూడా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. డబ్బులు ఆర్జించడమే పరమావధిగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్నారు. దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుంది సెలబ్రిటీల తీరు.