ఎపిలో వింత...ఎండాకాలంలో వర్షాలు

సూర్యుని జన్మని సూచించే  రథ సప్తమి రాగానే ఎండలు ప్రారంభమవుతాయి.  వర్షాకాలం వచ్చే వరకు వానలు ఉండవు. అయితే ఈ సంవత్సరం భిన్నంగా ఫిబ్రవరి నాలుగో తేదీకి  ముందే  రథసప్తమి ముందే ఎండలు మండిపోయాయి. ఇవ్వాల్టి వరకు ఎండలు దంచి కొడుతున్నాయి.  ఎపిలో మాత్రం రేపట్నుంచి మూడు రోజులు వర్షాలు ముంచెత్తుతాయని  విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.  మార్చి 22  నుంచి ఉత్తర కోస్తా జిల్లాలలో వర్షాలు పడతాయి.  వారం రోజుల పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయి. ఈ వర్షాల కారణంగా పది రోజుల పాటు చల్లటి వాతావరణం ఉంటుంది.  గంటకు 40  నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.