జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. ఫిబ్రవరి 2న పోలింగ్..?

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను కుదించిన నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల గడువును 31 రోజులు పెంచుతూ గడువు పెంచింది. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను పొడిగించాలనే యోచనలో ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫిబ్రవరి 2న ఎన్నికల పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu