టీడీపీలోకి ఘట్టమనేని.. ముహూర్తం ఖరారు!!

 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీల్లో చేరికలు, వలసలు ఊపందుకున్నాయి. సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కొద్దిరోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన అధికార పార్టీ టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7 లేదా 8 తేదీల్లో ఆయన టీడీపీలో చేరనున్నారని సమాచారం. వైసీపీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్న ఆయన.. టికెట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కృష్ణ అభిమాన సంఘాలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన వారితో సంప్రదించిన తర్వాత టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆయనకు టీడీపీ అధిష్టానం గుంటూరు జిల్లా నుంచి టికెట్ కేటాయించే అవకాశాలున్నాయి.