మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (60) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థులుగా వున్నారు. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కి తరలిస్తుండగా రమేష్ రాథోడ్ దారిలోనే కన్నుమూశారు. రమేష్ పార్థివ శరీరాన్ని ఉట్నూర్‌కి తరలించారు. రమేష్ రాథోడ్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1999లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రమేష్ రాథోడ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 తెలుగుదేశం పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరారు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి మారారు. ఇటీవలి ఎన్నికలలో ఆయన బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ ఆశించినప్పటికీ లభించలేదు.