స్వయంగా పెన్షన్ ఇవ్వనున్న చంద్రబాబు!

దేశ చరిత్రలో ఇంతవరకు జరగని సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎపిలో జులై 1న ల‌బ్దిదారుల‌కు పెన్షన్ పంపిణీకి ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేప‌థ్యంలో తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు, దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి అవబోతోంది. పాత బకాయిలు అన్నీ కలిపి ఏడు వేల రూపాయల పెన్సన్ చంద్రబాబు అందించబోతున్నారు. 

జూలై 1వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు... సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాల‌ని తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది.. ఈ మేరకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌లయింది. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పైనే ఉండాల‌ని తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది.