ఐసీయూలో యూపీ బీజేపీ చీఫ్..

 

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఆంత ఘన విజయాన్ని అందించిన పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. బీపీ సంబంధిత సమస్యలు రావడంతో ఆయనను ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, పరిస్థితి మెరుగుపడితే ఆయనను శుక్రవారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu