ఢిల్లీలో, ఏపీలో భూకంపం

 

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. నేపాల్‌లోని భరత్‌పూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో భూమిలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్టు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 11.44 సమయంలో ఒక నిమిషం 8 సెకన్లపాటు భూమి కంపించినట్టు సమాచారం. ఢిల్లీతోపాటు ఏపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో, కోల్‌కతా. జైపూర్ తదితర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. ప్రకంపనల కారణంగా ఇళ్ళలోని వస్తువులు కింద పడిపోవడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ళలోంచి బయటకి పరుగులు తీశారు. ఏపీలో భూ ప్రకంపలన ప్రాంతాలు ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా శనివారం ఉదయం 11.44 సమయంలోనే భూ ప్రకంపనలు సంభవించాయి. కృష్ణాజిల్లా గొల్లపూడి, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, రాజానగరం, రావులపాలెం, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, ఉర్లాం పరిసరాల్లో భూ ప్రకంపనలు జరిగాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu