ఏపీ సరిహద్దుల్లో రవాణా పన్ను

 

తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ వాహనాలకు రవాణా పన్ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తన సరిహద్దుల వద్ద రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినప్పటి ఏపీ అధికారులు నుంచి రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించిన మొదటిరోజే భారీ స్థాయిలో పన్ను వసూలైందని తెలుస్తోంది. కృష్ణాజిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 200 వాహనాల నుంచి కోటి 30 లక్షల రూపాయల పన్ను వసూలు చేశారు. తిరువూరు చెక్‌పోస్ట్ దగ్గర 80 వేల రూపాయల పన్ను వసూలైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu