తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (నవంబర్ 29)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  6 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని 58వేల 873 మంది దర్శించుకున్నారు. వారిలో 17వేల 133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 50లక్షల రూపాయలు వచ్చింది.