తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శుక్రవారం (మార్చి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (మార్చి 27) శ్రీవారిని మొత్తం 64 వేల 279 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 36 లక్షల రూపాయలు వచ్చింది.