తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (సెప్టెంబర్ 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 27) శ్రీవారిని మొత్తం 64 వేల 158 మంది దర్శించుకున్నారు.

వారిలో 24 వేల 938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది.