తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 21 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (అక్టోబర్19) శ్రీవారిని 66వేల 757 మంది దర్శించుకున్నారు.

వారిలో 26వేల 395 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu