తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం(జూన్ 4) 87వే 434 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

39వేల957 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 14 లక్షల రూపాయలు వచ్చింది.

సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.