దాసరి జగన్ ను సీఎం చేస్తానన్నారు..!

 

దర్శకరత్న దాసరి నారాయణరావు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. దాసరి మృతికి ఒక్క సినిమా పరిశ్రమ నుంచే కాదు.. పలువురు రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఇక వైసీపీ నేతలు కూడా దాసరి మృతికి నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాస‌రి ఎంతో మందికి ఓ దారిని చూపార‌ని అన్నారు...  ఆయ‌న మృతితో సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేద‌న వ్యక్తం చేశారు. అంతేకాదు దాస‌రి త‌మ పార్టీలో చేరి త‌మ అధినేత జగన్మోహన్‌రెడ్డిని సీఎం చేస్తానని ఇటీవలే చెప్పారని వారు వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu