కరోనా కేసుల్లో పోటా పోటీగా రెండు తెలుగు రాష్ట్రాలు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు లక్షల మార్కు దాటి ప్రస్తుతం 2,07,000 వద్దకు చేరింది ఇదే సమయం లో వలస కూలీలు సొంత రాష్ట్రాలకు చేరుకోవటం తో పాటు రైలు విమానాల ద్వారా వస్తున్న వారి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణాలో కేసుల సంఖ్య మూడు వేలు దాటి ప్రస్తుతం 3,020 కి చేరింది. ఇందులో నిన్న నమోదైన 129 కేసుల్లో తెలంగాణ వాసులలో 127 కేసులు నమోదు కాగా వలస కూలీలలో ఇద్దరికీ పాజిటివ్ తేలింది. ఇందులో జీ హెచ్ ఎం సి పరిధి లో నే 108 కేసులు బయట పడ్డాయి.

ఇక ఏపీలో నిన్న 180 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో రాష్ట్రం లోనివి 79 కేసులు కాగా మిగిలినవి ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండివచ్చినవి 101 కేసులు రికార్డ్ అయ్యాయి. దీంతో రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 3.971 కి చేరుకుంది. తాజాగా వచ్చిన కేసులలో ఎక్కువగా పశ్చిమ గోదావరి, కర్నూల్, కడప జిల్లాలలో నమోదయ్యాయి.