భారత్ లో పది వేలకు చేరువలో కరోనా మరణాలు

భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 10,667 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో కరోనాతో 380 మంది మరణించారు.ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,43,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి 9,900 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,80,013 మంది  కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 51 శాతానికి చేరింది.