భారత్ లో రోజుకి పదివేల కరోనా కేసులు!!

భారత్ లో మొదట్లో రోజుకి వంద కరోనా కేసులు నమోదైతేనే హడలిపోయాం. ఇప్పుడు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. రోజుకి పదివేల కేసులు నమోదయ్యే రోజులొచ్చాయి. తాజాగా ఒక్కరోజులోనే దాదాపు పదివేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 9,851  మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,26,770 కి చేరింది. గత 24 గంటల్లో 273 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6348 కి చేరుకుంది. ఇప్పటివరకు 1,09,462 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,10,960 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.