ఎన్నో కష్టాలను అధిగమించాం..

 

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పాలనలో మూడేళ్లు పూర్తి చేసుకున్నాం...మూడేళ్లలో ఎన్నో కష్టాలను అధిగమించాం..ఎవరైతే అన్యాయం చేశారో వారే సిగ్గుపడేలా అభివృద్ది చేస్తామని అన్నారు. విభజన ప్రభావం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉందని.. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలంటే రూ. 5 లక్షల కోట్లు ఖర్చవుతుందని..మహా నగరాన్ని నిర్మించాలంటే 20 ఏళ్లు సమయం పడుతుందని అన్నారు. అంతేకాదు.. గతేడాది వంద శాతం విద్యుత్ లక్ష్యాన్ని సాధించమని.. రాష్ట్రానికి  కరువు, తుఫాన్లు అతిపెద్ద సమస్యలు..కరువును ఎదుర్కొనేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నాం.. ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu