కేసీఆర్‌ మాజీ సీఎస్‌వో ఆత్మహత్య

తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ భద్రత అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..కరీంనగర్ కు చెందిన సరేష్ రావు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కేసీఆర్ భద్రతాధికారిగా పని చేశారు. అయితే రోజూలాగే శుక్రవారం విధులకు హాజరైన సురేష్ మధ్యాహ్నం భోజనం చేసిన తార్వత తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. చికిత్స నిమిత్తం అతన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మార్గంమధ్యలోనే మృతి చెందారు. కాగా గత కొంతకాలంగా సురేష్ రావు మానసిక పరిస్థితి సక్రమంగా లేదని చెబుతున్నారు.