చికెన్ తినండి.. తెలంగాణ మంత్రులు

 

తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, మంత్రి టి. పద్మారావు తో పాటు పలువురు నేతలు సికింద్రాబాద్ లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్థ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చికెన్ తింటే బర్డ్ ప్లూ వస్తోందని అనేక వదంతులు వస్తున్నాయని, అలాంటి వదంతులను నమ్మద్దని సూచించారు. ఎలాంటి భయం లేకుండా చికెన్ తినచ్చని అన్నారు. ఈ సందర్భంగా చికెన్ తో తయారుచేసిన వంటకాలను, గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట వ్యాప్తంగా ఇలాంటి చికెన్ అండ్ ఎగ్ మేళాలు నిర్వహిస్తామని, శుక్రవారం ప్లీనరీ సమావేశంలో కూడా చికెన్ తోనే వంటకాలు తయారుచేయిస్తామని తెలిపారు.