ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులకు తెగబడ్డ మావోలు...

 

ఛత్తీస్‌గఢ్‌లో తరచూ కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా ధనోరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. ధనోరా అటవీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపైకి మావోలు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుదాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం భద్రతావర్గాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu