మద్రాస్ ఐఐటీ బీఫ్ ఫెస్టివల్... క్యాంపస్ లో ఉద్రిక్తత..

 

తమిళనాడు ఐఐటీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐఐటీలో బీఫ్‌ విందు ఏర్పాటు చేసిన కొంతమంది విద్యార్థులపై దాడి జరిపారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి సూరజ్‌ ఈ విందు ఏర్పాటు చేయగా.. మరో వర్గం విద్యార్దులు వారిపై దాడి జరిపారు. ఈ దాడిలో సూరజ్ తీవ్రంగా గాయపడగా.. అతని కంటి చూపు కూడా కోల్పోయినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ఈ దాడిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ కళాశాల డీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇనిస్టిట్యూట్‌ ఎదుట బైఠాయించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అక్కడి చేరుకున్నారు. వారిని బలవంతంగా నిరసన విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu