నవ్వుతూనే మంత్రులకు చురకలు అంటించిన చంద్రబాబు...

 

ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పంథాని మార్చినట్టున్నారు. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్ గా ఉండే ఆయన ఈ మధ్య జోకులు వేస్తూ నవ్విస్తున్నారు. పార్టీ నేతలు కానీ.. అధికారులు కానీ కాస్త నిర్లక్ష్యం వహించినా సీరియస్ అవుతూ.. క్లాస్ తీసుకుంటారు చంద్రబాబు. అది అందరికీ తెలిసిందే. అందుకే అధికారులు చంద్రబాబు ముందు మాట్లాడటానికే భయపడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం చంద్రబాబు నవ్వుతూనే చురకలు అంటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన వీడియో కాన్పరెన్స‌లో చంద్రబాబునాయుడు తన మంత్రులపై జోకులు పేల్చారు. ఫైళ్ళ క్లియరెన్స్‌లో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి నారా లోకేశ్‌ ముందంజలో ఉన్నారు. వీరి వద్దకు వచ్చిన ఫైళ్ళు వచ్చినట్టు పంపుతున్నట్టున్నారు. అందుకే ముందంజలో ఉన్నారంటూ జోకు వేశారు. ఇక గంటాపై జోకులు వేశారు. గంటా ఎప్పుడోస్తారో,ఎప్పుడు వెళ్తారో...ఫైళ్ళ క్లియరెన్స్‌ను వెంట వెంటనే పూర్తి చేయాలని..  ఫైళ్ళ క్లియరెన్స్ చేయకపోతే ఇబ్బందులు ఎదురౌతాయని చెప్పారు. మొత్తానికి చంద్రబాబు.. సీరియస్‌గా చెప్పడం కన్నా నవ్వుతూనే చెప్తే పనులు అవుతాయని తెలుసుకున్నట్టున్నారు.