రెండాకులు గుర్తును సొంతం చేసుకుంటా....


తమిళనాడు అన్నాడీఎంకే సింబల్ వార్ లో ఈసీ శశికళ వర్గాని షాకిచ్చిన సంగతి తెలిసిందే కదా. శశికళ వర్గానికి కాకుండా.. పళని-పన్నీర్ వర్గానికి ఈసీ రెండాకులు గుర్తును కేటాయించింది. ఈ నేపథ్యంలో... దీనిపై స్పందించిన ఆ పార్టీ బ‌హిష్కృత నేత‌ దిన‌క‌ర‌న్.. ఓ ప్రతిజ్ఞ చేశాడు. తిరుర్పూర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దినకరన్.... ‘రెండాకుల గుర్తు’ను సొంతం చేసుకుంటాన‌ని  ఓ ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాదు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని అన్నారు. కాగా త‌మిళ‌నాడు దివంగత ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ వ‌చ్చేనెల‌ 21న నిర్వహించనున్న సంగతి తెలిసిందే కదా..