ఓటీటీలోకి అల్లు శిరీష్ 'బడ్డీ'...

అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం 'బడ్డీ' (Buddy). టెడ్డీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకుడు. స్టూడియో గ్రీన్‌ ఫిలిమ్స్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. (Buddy On OTT)

'బడ్డీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 30 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.

అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన బడ్డీ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా కృష్ణన్ వసంత్, ఎడిటర్ గా రూబెన్ వ్యవహరించారు.