విశాఖ వైసీపీకి బిగ్ షాక్ .. 9 మంది కార్పోరేటర్లు టీడీపీ తీర్థం

ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధులు వైసీపీకి రాజీనామా చేసి టిడిపి, జనసేన  తీర్థం పుచ్చుకుంటున్నారు.  కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో గెలిచిన  వైసీపీ ప్రజా ప్రతినిధులు  కూటమి వైపు మొగ్గు చూపారు. తాజాగా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన 12 మంది కార్పోరేటర్లు వైసీపీ ని వీడితే తాజాగా 9 మంది కార్పోరేటర్లు టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. చల్లా రజని, గేదెల లావణ్య, సునీత,  బూపతి రాజు సుజాత, ముర్రు వాణితో బాటు  మరో నలుగురు కార్పోరేటర్లు దేశం గూటికి చేరడానికి అమరావతి చేరుకున్నట్లు సమాచారం.